శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్టాత్మక ‘సంసద్ రత్న' పురస్కారం
By: chandrasekar Thu, 25 June 2020 1:23 PM
తెలుగు దేశం పార్టీ ఎంపీ
రామ్మోహన్ నాయుడుకు ప్రతిష్టాత్మక ‘సంసద్ రత్న’ పురస్కారం లభించింది. అతి పిన్న
వయసులోనే ఈ అవార్డు అందుకున్న ఎంపీగా ఆయన రికార్డు సృష్టించారు.
పార్లమెంట్ సభ్యుడిగా
కనబరిచిన అత్యుత్తమ పనితీరును గుర్తించి ఈ పురస్కారం ఇస్తారు. అలాగే ప్రజా సమస్యల
పరిష్కారంలో ఎంపీలు చూపించే చొరవను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు.
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్రామ్ మేఘవాల్, శ్రీరంగ్
అప్పా బర్నే, ఎన్కే ప్రేమ్చంద్రన్ సభ్యులుగా ఉన్న కమిటీ ఎంపిక
చేసింది.
దేశవ్యాప్తంగా 8 మంది
పార్లమెంట్ సభ్యులు, ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఒక
స్టాండింగ్ కమిటీ సభ్యుడు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కింజరాపు
రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ జిల్లా ప్రజలు, తెదేపా, కింజరాపు అభిమానులకు ఈ పురస్కారం అంకితమిస్తున్నట్లు
తెలిపారు.
2020 సంసద్ రత్న విజేతలు గా లోక్సభ సభ్యులు రామ్మోహన్
నాయుడు (ఆంధ్రప్రదేశ్),శశి థరూర్ (కేరళ), సుప్రియ సూలే
(మహారాష్ట్ర), సుభాష్ రామ్రావ్ భ్రమే (మహారాష్ట్ర), మీనా
విజయ్కుమార్ గవిట్ (మహారాష్ట్ర), అమోల్ రామ్ సింగ్ కోలే (మహారాష్ట్ర), నిశికాంత్
దూబె (ఝార్ఖండ్), అజయ్ మిశ్రా (ఉత్తర్ ప్రదేశ్) లను ఎంపిక చేశారు.
రాజ్యసభ సభ్యులు విశంబర్
ప్రసాద్ నిషాద్ రాజ్యసభ (ఉత్తర్ప్రదేశ్), చాయా వర్మ (ఛత్తీస్గఢ్), పీసీ
గద్దిగౌడర్ (వ్యవసాయ కమిటీ చైర్మన్) ఎంపికయ్యారు. ఇక గత లోక్సభకు సంబంధించి
సంసద్ మహారత్న పురస్కారాలు కూడా వెల్లడించారు.
భర్తృహరి మహతాబ్ (ఒడిశా), సుప్రియ
సూలె (మహారాష్ట్ర), శ్రీరంగ్ అప్పా బర్నే (మహారాష్ట్ర) ఈ పురస్కారాలు
గెలుచుకున్నారు. కాగా, అవార్డు పొందిన రామ్మోహన్ నాయుడును టీడీపీ అధినేత
చంద్రబాబు నాయుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభినందించారు.