జీతాలు చెల్లించక పోవడంతో ఆందోళనకు దిగిన శ్రీ చైతన్య స్కూల్ టీచర్లు
By: chandrasekar Sat, 26 Sept 2020 09:23 AM
కరోనా వల్ల విద్యాసంస్థలు
మూత పడ్డ విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని
మాదాపూర్ శ్రీచైతన్య లో పనిచేసే
ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం అవలంబిస్తున్న తీరుతో
విసిగిపోయి నిరసనకు దిగారు. వీరికి మాజీ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మద్దతు
తెలిపారు. ఉపాధ్యాయులు ఉపాధి మార్గం ఘోరంగా తయారైనట్లు తెలిపారు.
విద్యార్థుల తల్లి
దండ్రుల నుండి ఆన్లైన్ క్లాసుల పేరుతో నెలకు లక్షల రూపాయల డబ్బులను ఫీజుల పేరుతో దండుకుంటున్నారే తప్ప విద్య
సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఎలాంటి జీతాలు చెల్లించడం లేదని ఈ
సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రైవేట్ ఉద్యోగులకు
జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక జీవోలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అలసత్వం
వహించడం సరికాదని అన్నారు. వెంటనే వారికి జీతాలు చెల్లించే విధంగా రాష్ట్ర
ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థల పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో 100 మంది
ప్రైవేట్ ఉపాధ్యాయులతోపాటు వివిధ సంఘాల నేతలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.