సంచలన ఇన్నింగ్స్ తో చెలరేగిన సన్ రైజర్స్ యువ ఆటగాడు ..చెన్నై ముందు 165 పరుగుల లక్ష్యం
By: Sankar Fri, 02 Oct 2020 9:38 PM
చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బాట్స్మెన్ రాణించారు ..నిర్ణీత 20 ఓవర్లలో సన్రైజర్స్ హైదరాబాద్ 165 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. అయితే ఈ రోజు మ్యాచ్ లో స్టార్ ఆటగాళ్లు అయినా వార్నర్ , విలియమ్సన్ , మనీష్ పాండే అంతగా ఆకట్టుకోకపోయిన అండర్ 19 నుంచి వచ్చిన ఇద్దరు యువ ఆటగాళ్లు అనూహ్యంగా చెలరేయిపోయారు..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్కు ఆదిలోనే షాక్ తగిలింది. జానీ బెయిర్స్టో పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. దాంతో క్రీజ్లోకి వచ్చిన మనీష్ పాండే బ్యాట్కు పనిచెప్పాడు. కాకపోతే మంచి టచ్లో ఉన్న సమయంలో మనీష్ పాండే(29; 21 బంతుల్లో 5 ఫోర్లు) ఔటయ్యాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో సామ్ కరాన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో 47 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ను కోల్పోయింది.మరో 22 పరుగుల వ్యవధిలో డేవిడ్ వార్నర్(28; 29 బంతుల్లో 3 ఫోర్లు)ను డుప్లెసిస్ అద్భుతమైన క్యాచ్తో ఔట్ చేయగా, ఆపై వెంటనే కేన్ విలియమ్సన్ రనౌట్గా ఔటయ్యాడు. దాంతో 69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆరెంజ్ ఆర్మీ.
ఆ సమమయంలో యువ ఆటగాళ్లు ప్రియం గర్గ్-అభిషేక్లు దుమ్ములేపారు. సీఎస్కే బౌలింగ్ను ఓ ఆటాడుకున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 76 పరుగులు జత చేశారు. అభిషేక్(31; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఐదో వికెట్గా ఔటయ్యాడు. ఆపై ప్రియం గర్గ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కడవరకూ క్రీజ్లో ఉన్న ప్రియం గర్గ్ 26 బంతుల్లో 6 ఫోర్లు, 1సిక్స్తో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అబ్దుల్ సామద్ 8 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఫలితంగా ఎస్ఆర్హెచ్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లకు 164 పరుగులు చేసింది.