Advertisement

  • ఎస్సార్‌ నగర్ సీఐ మురళీ కృష్ణ పై ఫిర్యాదు చేసిన సినీనటి శ్రీసుధ

ఎస్సార్‌ నగర్ సీఐ మురళీ కృష్ణ పై ఫిర్యాదు చేసిన సినీనటి శ్రీసుధ

By: chandrasekar Wed, 29 July 2020 7:58 PM

ఎస్సార్‌ నగర్ సీఐ మురళీ కృష్ణ పై ఫిర్యాదు చేసిన సినీనటి శ్రీసుధ


గ‌త కొన్ని రోజులుగా శ్రీసుధ వార్త‌ల్లో ప్రముఖంగా వున్నారు. సినీ నటి, అర్జున్ రెడ్డి ఫేం శ్రీసుధ ఏసీబీని ఆశ్రయించారు. ఎస్సార్‌ నగర్ సీఐ మురళీ కృష్ణ తన నుంచి లంచం తీసుకున్నారంటూ, ఓ కేసులో నకిలీ పత్రాలు సృష్టించారంటూ ఫిర్యాదు చేశారు. కొద్దిరోజుల కిందట ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కె.నాయుడు తమ్ముడు శ్యామ్ కె.నాయుడు తనను పెళ్లి పేరుతో మోసం చేశాడంటూ శ్రీసుధ ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు కోసం సీఐ మురళీకృష్ణ‌ తన నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

అప్పట్లో ఆ కేసు పెద్దదుమారమే రేపింది. అయితే ఆ కేసు దర్యాప్తులో భాగంగా తన వద్ద సీఐ మురళీ కృష్ణ డబ్బులు వసూలు చేశాడని శ్యామ్ కె. నాయుడిని అరెస్టు చేయకుండా రాజీ చేసుకున్నట్లు నకిలీ పత్రాలు సృష్టించాడని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఆయనతో మాట్లాడిన సాక్ష్యాలను కూడా ఏసీబీకి అందజేసినట్లు సమాచారం. కాగా గ‌త కొన్ని రోజులుగా శ్రీసుధ వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. శ్యామ్ కే నాయుడుపై ఛీటింగ్ కేసు పెట్ట‌డం స‌హా, అత‌డు న‌కిలీ ప‌త్రాల‌తో బెయిల్ తెచ్చుకున్నాడంటూ మ‌రోసారి కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు శ్యామ్ కె నాయుడుకు మంజూరు చేసిన‌ బెయిల్ ను ర‌ద్దు చేసింది.

Tags :

Advertisement