Advertisement

  • ఆ సమయంలో జైల్లో చిత్రహింసలు పెట్టారు ..శ్రీశాంత్

ఆ సమయంలో జైల్లో చిత్రహింసలు పెట్టారు ..శ్రీశాంత్

By: Sankar Thu, 02 July 2020 7:51 PM

ఆ సమయంలో జైల్లో చిత్రహింసలు పెట్టారు ..శ్రీశాంత్



ఫిక్సింగ్‌ నేపథ్యంలో తాను దుర్భర జీవితాన్ని గడిపానని భారత పేసర్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. విచారణలో భాగంగా తనను టెర్రరిస్టులతో పాటు ఉంచారని, గంటలకొద్దీ చిత్రహింసలు పెట్టేవారని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటి పరిస్థితులను తలచుకుంటేనే బాధ, భయం కలుగుతాయని చెప్పుకొచ్చాడు. ‘నన్ను టెర్రరిస్టుల వార్డులోకి తీసుకెళ్లేవారు. అక్కడ పరిస్థితులు దారుణంగా ఉండేవి. నన్ను వాళ్లిష్టం వచ్చినట్లు ఆడుకునేవారు. దాదాపు 12 రోజుల పాటు రోజుకు 16 నుంచి 17 గంటల పాటు ఘోరంగా చిత్రహింసలు పెట్టేవారు.

ఆ సమయంలో నా ఇల్లు, కుటుంబం ఎంతగానో గుర్తుకొచ్చేవి’ అని శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు.అయితే ఒకరోజు మా అన్నయ్య వచ్చి ఇంటి దగ్గర అందరూ బాగానే ఉన్నారు అని చెప్పాకనే న మనసు కుదుట పడింది..అలంటి పరిస్థితుల్లో నా కుటుంభం నాకు అండగా ఉంది ..అదృష్టవ శాత్తు నేను జైలుకు వెళ్లిన్నప్పుడు , బయటకు వచ్చినప్పుడు ఎవ్వరు ఫోటోలు తీయలేదు ..లేకుంటే నా పిల్లలు అవి చూస్తే నేను తట్టుకునేవాడిని కాదు అని శ్రీశాంత్ అన్నాడు

ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్ దాదాపు కెరీర్‌నే కోల్పోయాడు. కోర్టుల చుట్టూ తిరుగుతూ జైళ్లలో గడిపాడు. తొలుత శ్రీశాంత్ జీవితకాలం క్రికెట్ ఆడకుండా బీసీసీఐ నిషేధం విధించినప్పటకీ ఆ తరువాత దానిని ఏడేళ్లుకు తగ్గించింది. ఈ ఏడాది సెప్టెంబరుతో నిషేధం తొలగిపోనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ కేరళ రంజీ జట్టుకు ఆడేందుకు శ్రీశాంత్ కసరత్తు చేస్తున్నాడు.

Tags :
|
|

Advertisement