Advertisement

  • ఐపీయల్ లో రీఎంట్రీకు ఆ జట్టే నా తొలి ప్రాధాన్యత ..శ్రీశాంత్

ఐపీయల్ లో రీఎంట్రీకు ఆ జట్టే నా తొలి ప్రాధాన్యత ..శ్రీశాంత్

By: Sankar Fri, 03 July 2020 2:19 PM

ఐపీయల్ లో రీఎంట్రీకు ఆ జట్టే నా తొలి ప్రాధాన్యత ..శ్రీశాంత్


2013 ఐపీయల్ లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం వలన క్రికెట్ నుంచి కనుమరుగుఅయిన కేరళ స్పీడ్ స్టర్ శ్రీశాంత్ మళ్ళీ రి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు .. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లభించకపోవడంతో శ్రీశాంత్ నిర్దోషిగా బయట పడ్డాడు ..వచ్చే ఏడాది ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌ల్లో ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న శ్రీశాంత్‌ తనకు వచ్చిన ప‍్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాడు. దీనిలో భాగంగా వచ్చే ఏడాది ఐపీఎల్‌కు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు..

క్రిక్‌ ట్రేకర్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ సెషన్‌లో మాట్లాడిన శ్రీశాంత్‌.. ఐపీఎల్‌లో ఏయే జట్లకు ఆడాలనే ఉందనే విషయాన్ని వెల్లడించాడు. తన తొలి ప్రాధాన్యత ముంబై ఇండియన్స్‌గా శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. గతంలో ముంబైకు ఆడిన సందర్భంలో తనకు లభించిన మద్దతు కారణంగానే ఆ జట్టుకు మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నట్లు తెలిపాడు. సచిన్‌ టెండూల్కర్‌తో పాటు సపోర్టింగ్‌ స్టాఫ్‌ నుంచి తనకు ఎంతగానో సహకారం లభించిన విషయాన్ని శ్రీశాంత్‌ ప్రస్తావించాడు. మరొకవైపు విరాట్‌ కోహ్లి నేతృత్వం వహించే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)తో పాటు, ఎంఎస్‌ ధోని సారథ్యం వహించే చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)కు కూడా ఆడాలని ఉందన్నాడు.

క్రికెట్‌ అభిమానిగా ముంబై ఇండియన్స్‌ అంటే బాగా ఇష్టం. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ పాజీని కలిసే అవకాశం ఉంటుంది. సచిన్‌ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అవకాశం వస్తే ముంబైకు ఆడటానికి సిద్ధంగా ఉన్నా’ అని శ్రీశాంత్‌ తెలిపాడు. ఆ తర్వాత ఆర్సీబీ, సీఎస్‌కేలకు ఆడాలనుకుంటున్నా. ఒక వేళ ఆ మూడు జట్లు కాకపోతే ఏ జట్టు తీసుకున్నా ఆడతా...కాగా ఐపీఎల్‌ అరంగేట్రంలోనే ముంబై ఇండియన్స్‌కు శ్రీశాంత్‌ ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే.

Tags :
|

Advertisement