Advertisement

  • శ్రీశాంత్ ఆల్ టైం ఇండియన్ టి ట్వంటీ జట్టు ..కెప్టెన్ గా రోహిత్ శర్మ

శ్రీశాంత్ ఆల్ టైం ఇండియన్ టి ట్వంటీ జట్టు ..కెప్టెన్ గా రోహిత్ శర్మ

By: Sankar Thu, 09 July 2020 8:37 PM

శ్రీశాంత్ ఆల్ టైం ఇండియన్ టి ట్వంటీ జట్టు ..కెప్టెన్ గా రోహిత్ శర్మ



స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంతో టీం కు దూరమైన ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ ఇటీవలే తన మీద ఉన్న బ్యాన్ ముగించుకొని మల్లి క్రికెట్ లోకి రే ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్నాడు ..అయితే తాజాగా ఆల్ టైం ఇండియన్ టి ట్వంటీ లెవెన్ ను ప్రకటించాడు ..అయితే ధోని , కోహ్లిలను కాదని రోహిత్ శర్మను కెప్టెన్ గా ఎంచుకున్నాడు ..

ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌ని కొనసాగించిన శ్రీశాంత్.. మూడో స్థానానికి విరాట్ కోహ్లీని ఎంపిక చేశాడు. కానీ.. నెం.4లో సురేశ్ రైనాని ఎంపిక చేయడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గత రెండేళ్లుగా భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న రైనా.. కేవలం ఐపీఎల్‌లో మాత్రమే ఆడుతున్నాడు. కానీ.. ఈ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌పై శ్రీశాంత్ నమ్మకం ఉంచాడు. ఇక ధోనీ కెప్టెన్సీలోనే 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ ఆడిన శ్రీశాంత్.. టీమ్‌లో అతనికి చోటిచ్చినా కెప్టెన్‌గా మాత్రం ఎంపిక చేయలేదు. ధోనీకే కాదు.. కోహ్లీ కూడా ఆ కెప్టెన్సీ అవకాశం దక్కలేదు.

ఇక అల్రౌండర్లుగా హార్దిక్ పాండ్య , రవీంద్ర జడేజాలను తీసుకున్నాడు ..స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ కు చోటిచ్చినా శ్రీశాంత్ ..ఫాస్ట్ బౌలర్ల కోటాలో తనతో పాటు జస్ప్రీత్ బుమ్రా కు స్థానం కల్పించాడు ..ఇక ఇటీవలి కాలంలో అద్భుత ఫామ్లో ఉన్న కె ఎల్ రాహుల్ పైన కూడా శ్రీశాంత్ నమ్మకం ఉంచాడు ..

శ్రీశాంత్ ఆల్ టైం ఇండియన్ టి ట్వంటీ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, మహేంద్రసింగ్ ధోని, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రీశాంత్

Tags :
|
|
|

Advertisement