Advertisement

మళ్ళీ మైదానంలో శ్రీశాంత్ ...కేరళ జట్టులో చోటు

By: Sankar Thu, 31 Dec 2020 09:57 AM

మళ్ళీ మైదానంలో శ్రీశాంత్ ...కేరళ జట్టులో చోటు


భారత పేసర్ శ్రీశాంత్ 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడని బీసీసీఐ అతనికి జీవితకాల నిషేధం విధించింది. అయితే బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసింది. తర్వాత ఆ నిషేధాన్ని 7 సంవత్సరాలకు కుదించారు.

తాజాగా ఈ ఏడాది సెప్టెంబర్ లో శ్రీశాంత్‌ నిషేధం ముగిసింది. అయితే వచ్చే ఏడాది జనవరి 10 న ప్రారంభం కానున్న ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కోసం కేరళ ప్రకటించిన జట్టులో శ్రీశాంత్ పేరు ఉంది. ఇక ఈ జట్టుకు సంజు శాంసన్ న్యాయకత్వం వహించనున్నాడు. ఇక వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ వేలంలో తన పేరు ఉంచుతానని శ్రీశాంత్ ఎప్పుడో ప్రకటించాడు.

కాగా ఒకప్పుడు టీంఇండియాలో స్టార్ బౌలర్ అయినా శ్రీశాంత్ ఐపీయల్ లో ఫిక్సింగ్ కారణంగా క్రికెట్ నుంచి వాడిలాగాల్సి వచ్చింది అయితే కోర్ట్ లో ఫిక్సింగ్ కేసు పై గెలిచినా శ్రీశాంత్ మల్లి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు..2023 ప్రపంచ కప్ లో బరిలోకి దిగడమే తన లక్ష్యంగా ప్రకటించాడు...

Tags :
|

Advertisement