Advertisement

  • దసరా సందర్భంగా బెజవాడ దుర్గమ్మ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు

దసరా సందర్భంగా బెజవాడ దుర్గమ్మ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు

By: chandrasekar Sat, 17 Oct 2020 10:16 AM

దసరా సందర్భంగా బెజవాడ దుర్గమ్మ దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు


ప్రతిసంవత్సరం బెజవాడ దుర్గమ్మ గుడిలో దసరా వేడుకలు చాలా వేడుకగా జరుపబడుతాయి. ఈ సారి కరోనా వల్ల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. శనివారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మొత్తం పది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. దసరా రోజున ఎంతమంది భక్తులను అనుమతించాలన్నదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా భక్తుల సంఖ్య కుదించేందుకు ఆంక్షలను కఠినతరం చేయనున్నారు. నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దుర్గ గుడి పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు చెప్పారు. నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం.

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలి. మాస్క్ తప్పని సరి. ఏడాది నుంచి నిర్మాణంలో ఉన్న శివాలయం కూడా పూర్తయింది. శనివారం నుంచి శివాలయంలో దర్శనాలకు అనుమతి కల్పిస్తున్నాం. దసరాకి 74 వేల టికెట్స్ ఇప్పటికే ఆన్‌లైన్ లో బుక్ అయ్యాయి. ఇంకా కేవలం1500 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా భక్తులు వినియోగించుకోవాలి అని స్వామినాయుడు సూచించారు. ఇక ఈఓ సురేష్ బాబు నవరాత్రుల ఏర్పాట్లపై మాట్లాడారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుంచి రావాలని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తామని తేల్చి చెప్పారు.

దసరా వేడుకల్లో అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు చీరను సమర్పిస్తారు. ఆన్‌లైన్ టికెట్ సమస్యలు ఉన్న వాళ్ళకి పున్నమి ఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఈ సారి సామూహిక పూజలు లేవు. పరోక్ష పూజలు అందుబాటులో ఉంటాయి. ఘాట్ రోడ్ లో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో తెలిపారు. వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలు వరకే అనుమతి ఉంటుందని ఈవో సురేష్ బాబు చెప్పారు. వీఐపీలు కూడా ఆన్‌లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. టైం స్లాట్ ప్రకారమే రావాలని తేల్చి చెప్పారు. ఇందువల్ల సాంఘీక దూరం పాటించడం వల్ల జాగ్రత్తలు తీసికోవచ్చన్నారు.

Tags :

Advertisement