నాన్న గారి ఆరోగ్యం మరింత మెరుగుపడింది ..అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎస్పీ చరణ్
By: Sankar Sun, 30 Aug 2020 06:22 AM
తన తండ్రి ఆరోగ్యం మరింత మెరుగుపడిందని ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ శనివారం తన వీడియో సందేశంలో తెలిపారు. కరోనా వైరస్కు గురైన ఎస్పీ బాలు ఈనెల 5వ తేదీ నుంచి చెన్నైలోని ఎంజీఎం హెల్త్కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
ఊపిరితిత్తులు కూడా మెరుగుపడినట్లు తెలుస్తోంది. గత కొన్నిరోజులుగా చేస్తున్న ఫిజియోథెరపీకి కూడా ఆయన శరీరం సహకరిస్తున్నట్లు సమాచారం. కాగా, ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఆస్పత్రి వర్గాలు శనివారం బులెటిన్ విడుదల చేయలేదు.
కాగా తెలుగులోనే గాక దేశ వ్యాప్తంగా తన గాత్రంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఎస్పీ బాలు కోసం దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రార్థిస్తున్నారు..కరోనా నుంచి కోలుకొని వచ్చి మల్లి ఎప్పటిలాగే తన మధురమైన గాత్రంతో అలరించాలని అభిమానులు కోరుతున్నారు..