Advertisement

  • వచ్చే సోమవారం నాన్న ఆరోగ్యం గురించి ఒక శుభవార్త వింటారు.. ఎస్పీ చరణ్

వచ్చే సోమవారం నాన్న ఆరోగ్యం గురించి ఒక శుభవార్త వింటారు.. ఎస్పీ చరణ్

By: Sankar Thu, 03 Sept 2020 7:34 PM

వచ్చే సోమవారం నాన్న ఆరోగ్యం గురించి ఒక శుభవార్త వింటారు.. ఎస్పీ చరణ్


గత కొంతకాలంగా కరోనాతో చెన్నై లోని హాస్పిటల్లో పోరాడుతున్న విషయం తెలిసిందే..ఎస్పీబీ తొందరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా అభిమానులు ప్రార్థనలు చేసారు..అయితే వెల్లడించారు. ఈ మేరకు చరణ్ గురువారం ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. వరుసగా నాలుగో రోజు తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన నిదానంగా కోలుకుంటున్నారని పేర్కొన్నారు. దేవుడి ఆశీర్వాదం తో వచ్చే సోమవారం ఒక శుభవార్త వింటామని అన్నారు.

చరణ్ ట్వీట్ తో బాలు త్వరలోనే కోలుకుంటాడని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకుని డిశ్చార్జ్ అవ్వాలని ప్రార్ధనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్, ఎక్మో సహాయంతో చికిత్సను అందజేస్తున్నారు.

ప్రస్తుతం ఆయనకు స్వల్పంగా ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారని పూర్తిగా స్పృహలోనే ఉన్నారని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు కూడా చెబుతున్నాయి. అటు, కరోనా బారిన పడిన బాలు భార్య కూడా చికిత్స పొందుతూ నెమ్మదిగా కోలుకుంటున్నారు.

Tags :
|

Advertisement