Advertisement

  • ఎస్పీ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన ఎస్పీ చరణ్

ఎస్పీ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన ఎస్పీ చరణ్

By: chandrasekar Sat, 29 Aug 2020 5:46 PM

ఎస్పీ ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించిన ఎస్పీ చరణ్


కరోనా కారణంగా ఆరోగ్యం క్షీణించడంతో గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రహ్మణం ఎంజీఎం హాస్పటిల్‌లో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఆయన కోసం అభిమానలు చేసిన పూజలు ఫలించాయి. ఆయన మెల్ల మెల్లగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెన్నై ఎంజీఎం హాస్పిటల్ వర్గాలతో పాటు ఎప్పటి కపుడు ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై వీడియోలను విడుదల చేస్తున్నారు.

ఎస్పీ చరణ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం నాన్న ఆరోగ్యం మెరుగవుతుంది. బాలు గారికి వెంటిలేటర్‌తో పాటు ఎక్మో సాయంతో చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం డాక్టర్లు ఎస్పీబీకి ఫిజియోథెరపీ చికిత్స అందించినట్టు తెలిపారు. నిన్నటితో పోలిస్తే ఆరోజు నాన్నగారి ఆరోగ్యం మెరుగైందన్నారు. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికి చరణ్.. పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యంపై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు కూడా తాజగా ఓ బులెటెన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నట్టు తెలిపారు. మునుపటి కంటే ఆయన ఆరోగ్యం మెరుగైనట్టు తెలిపారు. ఆయన అందరినీ గుర్తు పడుతున్నట్టు తెలిపారు. మరోవైపు బాలు ఆరోగ్యం కుదటపడాలని ఎంజీఎం హాస్పటిల్ ఐసీయూ కింది అంతస్తులో వేద పండితులు నిత్యమూ వేద పారాయణం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని బాలూకు చికిత్స చేస్తున్న గదిలో ఉన్న టీవీలో లైవ్ వచ్చే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
.

Tags :
|

Advertisement