Advertisement

చెన్నైలో రేపు ఎస్పీ బాలు అంత్యక్రియలు

By: Sankar Fri, 25 Sept 2020 3:19 PM

చెన్నైలో రేపు ఎస్పీ బాలు అంత్యక్రియలు


గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్నవార్త కోట్లాది మంది అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న బాలు ఇక లేరన్న వార్త అందరినీ శోకసంద్రంలోకి నెట్టింది. గత 40 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఇవాళ మధ్యాహ్నం కన్నుమూవారు.

అయితే, రేపు సాయంత్రం ఎస్పీ బాలసుబ్రహ్మణ్య అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. చెన్నై తిరువళ్లూరు జిల్లాలో రేపు బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.. రెడ్‌హిల్స్‌ సమీపంలోని తామరైపాకంలో బాలు పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఇవాల సాయంత్రం 4 గంటలకు ఎంజీఎం నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్‌ ఇంటికి బాలు పార్థివదేహాన్ని తరలిస్తున్నారు.

అభిమానుల సందర్శనార్థం కోడంబాకంలో బాలు పార్థివదేహాన్ని ఉంచుతారు.. అనంతరం రేపు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహిస్తారు. తన జీవితంలో చాల ఏళ్ళు పాటలతోనే గడిపిన ఎస్పీ బాలు చివరకు హాస్పిటల్లో చేరే ముందు వరకు కూడా పాడుతూనే ఉన్నారు..ఎస్పీ బాలు మనతో లేకపోయినా కూడా ఆ గాత్రం ద్వారా ఎప్పటికి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిల నిల్చిపోతాడు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు..

Tags :

Advertisement