ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని తెలిపిన ఎస్పీ చరణ్
By: chandrasekar Thu, 17 Sept 2020 09:32 AM
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం
ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని ఎస్పీ చరణ్ తెలిపారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ
బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న కరోనా వైరస్ బారిన పడి చెన్నై లోని ప్రముఖ
హాస్పిటల్లో చికిత్స పొందుతూ క్రమంగా
కోలుకుంటున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్
పెరగటంతో అప్పట్లో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దాంతో అప్పటి నుంచి ఆయన ఎక్మో
సపోర్టుతో చికిత్స తీసుకుంటున్నారు. ఆ తర్వాత నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా
మెరుగుపడుతూ వస్తున్నది. అయన అభిమానులు వేడుకోవడంతో అయన అర్యోగం మెరుగవుతున్నట్లు
చరణ్ తెలిపారు.
అందరి అభిమానాలు ఉండడంతో
డాక్టర్ల పర్యవేక్షణలో ప్రస్తుతం తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని
ఎస్పీ చరణ్ తెలిపారు. ప్రస్తుతం తన తండ్రి ఈసీఎంవో సపోర్టుతో ఉన్నారని, ఫిజియోథెరపీలో
చురుకుగా పాల్గొంటున్నారని ఎస్పీ చరణ్
పేర్కొన్నారు. తన తండ్రి త్వరగా కోలుకోవడం కోసం శ్రమించిన ఆస్పత్రి వైద్యులకు, ఆయన
అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. SPB
త్వరగా కోలుకొని ఇంటికి రావాలని అతని అభిమానులు
ఎదురుచూస్తున్నారు.