Advertisement

  • ఐసీయూ నుండి థంబ్స్ అప్ చూపిన ఎస్.పి.బాలసుబ్రమణ్యం

ఐసీయూ నుండి థంబ్స్ అప్ చూపిన ఎస్.పి.బాలసుబ్రమణ్యం

By: chandrasekar Sat, 15 Aug 2020 10:51 AM

ఐసీయూ నుండి థంబ్స్ అప్ చూపిన ఎస్.పి.బాలసుబ్రమణ్యం


కరోనా కారణంగా SPB హాస్పిటల్ లో ఆగష్టు 5 చేరిన సంగతి అందరికి తెలిసిందే. ఫేమస్ ప్లేబ్యాక్ సింగర్ ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఆరోగ్యం క్షీణించినట్లు గురువారం రోజు సాయంత్రం వచ్చిన వార్తలు ఆయన అభిమానులను, సంగీత ప్రియులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. కరోనావైరస్ పాజిటివ్‌గా తేలిన అనంతరం ఆయన చెన్నైలోని ఎంజిఎం హెల్త్‌కేర్ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ సాయంత్రం ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేసిన ఎంజీఎం ఆసుపత్రి నిన్న రాత్రి నుండి బాలును లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అయన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అనుకోకుండా బాలు ఆరోగ్యం క్షీణిస్తోందని తెలియగానే ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదే విషయమై ఎస్పీ బాలు కుమారుడు, ప్రముఖ సింగర్ ఎస్పీ చరణ్ తమిళ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతానికి తన తండ్రి ఆరోగ్యం స్థిరంగానే ఉందని, అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారని ధృవీకరించారు. అలాగే బాలు సోదరి కూడా మీడియాకు ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. బాలు కోలుకోవాలని ప్రార్థిస్తున్న వాళ్లందరికీ ఆ ఆడియో ద్వారా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

గురువారం సాయంత్రం ఆసుపత్రి నుండి ఎస్పీబి తన అభిమానులకు తంబ్స్ అప్ చూపిస్తున్న ఫొటో విడుదలైంది. బాలు ఆరోగ్యం క్షీణిస్తోందని వార్తలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంత గొప్ప గాయకుడికి ఆరోగ్యం తొందరగా కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కావాలని అందరూ కోరుకుంటున్నారు.

Tags :
|

Advertisement