ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి అప్డేట్స్ ...
By: Anji Fri, 25 Sept 2020 08:37 AM
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు ఆయనకు చికిత్సనందిస్తున్న ఎంజీఎం ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది. నిమిష నిమిషానికి అయన ఆరోగ్యం మరింతగా క్షీణించినట్లు ఎంజిఎం హాస్పిటల్ అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు బాలు హెల్త్ బులిటెన్ను విడుదల చేశారు ఆసుపత్రి వర్గాలు. గత 24 గంటలుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు వెల్లడించారు. ఎక్మోతో పాటు వెంటిలేటర్. ఇతర ప్రాణాదార చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
15 రోజుల పాటు కరోనాతో పోరాడారని వెల్లడించారు. ఆయన వెంట అతని కుమారు, కోడలు ఇంకా కుటుంబ సభ్యులు వున్నారు. దీంతో సంగీత ప్రపంచం అంతా ఆయన క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ ప్రార్థనలు చేస్తున్నారు. ఇంకా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు,పలువురు రాజకీయ నాయకులూ బాలు ఆరోగ్య పరిస్థితి గురుంచి అడిగి తెలుసుకున్నారు. అయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, థమన్లు అందరూ బాలుగారి ఆరోగ్యం కోసం ప్రార్థించాలని కోరుతూ.. ఆయన త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా కోరారు. కాగా, బాలు ఆరోగ్యం మరింత క్షీణించటంతో.. పలువురు ప్రముఖులు చెన్నై ఎంజీఎం ఆసుపత్రి కి తరలి వస్తున్నారు.