కరోనా నియమాలకు కాస్త మినహాయింపులు ప్రకటించిన దక్షిణ కొరియా
By: chandrasekar Mon, 14 Sept 2020 09:18 AM
కరోనా నియమాలకు దక్షిణ కొరియా కాస్త మినహాయింపులు
ప్రకటించింది. కొరోనావైరస్ ను నిరోధించేందుకు దక్షిణ కొరియా అమలు చేస్తోన్న సోషల్
డిస్టెన్సింగ్ నియమాలను రెండు వారాల పాటు కొన్ని మినహాయింపులతో కొనసాగించనుంది.
ముఖ్యంగా సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఈ మినహాయింపులు రెండు వారాల పాటు అమలులో
ఉండనున్నాయి. మరో రెండు వారాల పాటు సెలవులు ఎక్కువగా ఉండటంతో సోషల్ డిస్టెన్సింగ్
నియమాలను కాస్త మినహాయింపులు ఇచ్చింది.
నియమాల మినయయింపులో
భాగంగా రాత్రి 9 దాటిన తరువాత బయట డిన్నర్ చేయకూడదన్న నిషేధాన్ని తొలగించింది. అయితే డైనింగ్ ఔట్
చేసే కస్టమర్ల వివరాలు రెస్టారెంట్ యాజమాన్యం తప్పకుండా రికార్డు చేయాల్సి
ఉంటుంది. ఈ సమయంలో జిమ్ లు, ఇంటర్నెట్ సెంటర్లు కూడా తెరుచుకోనున్నాయి. ఇండోర్
మీటింగ్ లేదా పార్టీలకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
బయట జరిగే మీటింగ్లకు
కేవలం 100
మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే క్రీడా సంబంధిత టోర్నమెంట్లు చూడటానికి
మాత్రం ప్రేక్షకులకు అనుమతి లేదు. చూసెక్ హాలీడేస్ అనంతరం సెప్టెంబర్ 28 నుంచి సోషల్ డిస్టెన్సింగ్ నిబంధనలు మళ్లీ అమలు
చేయనుంది. దక్షిణ కొరియా ప్రభుత్వం అమలు
చేసిన కఠిన నియమాల వల్ల వైరస్ సోకిన వారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో ప్రభుత్వం
కాస్త సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. వ్యాప్తి పెరిగితే నియమాల కఠిన తరం
చేయనున్నారు.