బయో బబుల్ను లగ్జరీ జైలుతో పోల్చిన దక్షిణాఫ్రికా క్రికెటర్ కగిసో రబాడా
By: chandrasekar Tue, 24 Nov 2020 10:41 AM
బయో బబుల్ను లగ్జరీ
జైలుతో దక్షిణాఫ్రికా క్రికెటర్ కగిసో రబాడా పోల్చాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్
కగిసో రబాడా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య త్వరలో
సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో రబాడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం
కరోనా వైరస్ నేపథ్యలో క్రికెటర్ల కోసం ఏర్పాటు చేసిన బయో సెక్యూర్ బబుల్ను లగ్జరీ
జైలుతో పోల్చాడు.
ప్రస్తుతం ఇంగ్లండ్, సౌతాఫ్రికా
మధ్య మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ నవంబర్ 27 నుంచి
ప్రారంభం కానుంది. ప్రస్తుతం రెండు జట్లు కేప్ టౌన్లోని బయో బబుల్లో ఉన్నాయి. ఈ
టూర్ కు ముందు దుబాయ్లో జరిగిన ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున అతను ఆడాడు.
కరోనా వల్ల అతను అక్కడ
సుమారు మూడు నెలల పాటు బయో బబుల్లో ఉన్నాడు. ‘అది చాలా కష్టం. మనం వేరొకరితో
కలవలేం. మాట్లాడలేం. మన స్వేచ్ఛను కోల్పోతాం. అది ఓ రకంగా లగ్జరీ జైలులో ఉన్నట్టుంది.
అని రబాడా చెప్పినట్టు ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో తెలిపింది.