సంక్షోభంలో కూరుకుపోయిన సౌతాఫ్రికా క్రికెట్....
By: chandrasekar Wed, 28 Oct 2020 11:17 AM
సౌతాఫ్రికా క్రికెట్
ప్రస్తుతం సంక్షోభంలో పడిపోయింది.
సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు(సీఎస్ఏ)లో
జాతివివక్ష, అవినీతి, అధికార దుర్వినియోగం వంటి ఆరోపణల నేపథ్యంలో క్రికెట్
బోర్డు డైరెక్టర్లు ఒక్కసారిగా రాజీనామా చేశారు.
బోర్డు తాత్కాలిక సీఈవో
జాక్వెస్ ఫాల్, అధ్యక్షుడు క్రిస్ నెంజానిలు నెలరోజుల క్రితమే
రాజీనామా చేశారు. తాజాగా మిగిలిన నలుగురు బోర్డు సభ్యులు రాజీనామా చేయడంతో
తాత్కాలిక కమిటీ నియామకానికి మార్గం సుగమం అయింది.
బోర్డు వ్యవహారాల్లో ఆదేశ
క్రీడాశాఖ మంత్రి నాథీ తెత్వా జోక్యం చేసుకోవడానికి ఒక్క రోజు ముందే డైరెక్టర్లు
రాజీనామా చేశారు. ఇండిపెండెంట్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్లు అందరూ ఇప్పుడు రాజీనామా చేసినట్లు సీఎస్ఏ ట్విటర్లో
తెలిపింది.
Tags :
cricket |
plunged |
into |