ధోని నా రిటైర్మెంట్ మ్యాచ్ గుర్తుండిపోయేలా చేసాడు...గంగూలీ
By: Sankar Sun, 12 July 2020 07:21 AM
సౌరవ్ గంగూలీ ఇండియన్ క్రికెట్ కు దూకుడు నేర్పిన కెప్టెన్ ..యువ ఆటగాళ్లను ప్రోత్సహించి ఇండియన్ క్రికెట్ ను అత్యుత్తమంగా నిలిపిన కెప్టెన్ ..ఆలా గంగూలీ కెప్టెన్సీ లో అవకాశం అందుకొని ఆ తర్వాత దిగ్గజ ఆటగాడిగా మారాడు మహేంద్ర సింగ్ ధోని ..అయితే ఆ తర్వాత కాలంలో ధోని కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు ..దీనితో గంగూలీ ధోని కెప్టెన్సీలోనే తన రిటైర్మెంట్ మ్యాచ్ ఆడాడు ..అయితే ఆ మ్యాచ్లో ధోని ఇచ్చిన గౌరవానికి తాను ఆశ్చర్యపోయాను అని అన్నాడు గంగూలీ ..
రిటైర్మెంట్ మ్యాచ్ గురించి తాజాగా ఓపెనర్ మయాంక్ అగర్వాత్తో ‘ఓపెన్ నెట్స్ విత్ మయాంక్’ ఛాట్ షోలో గంగూలీ మాట్లాడుతూ ‘‘నా చివరి టెస్టు మ్యాచ్ నాగ్పూర్లో ఆడాను. ఆరోజు మ్యాచ్లో ఆఖరి రోజు.. లాస్ట్ సెషన్. గార్డ్ హాఫ్ హానర్తో నా సహచరులు మైదానంలోకి నన్ను ఆహ్వానించారు.
ఆ సెషన్ ఆఖర్లో కెప్టెన్ ధోనీ.. నన్ను కెప్టెన్గా జట్టుని నడిపించమని కోరాడు. నేను ఆ సర్ప్రైజ్ని ఊహించలేదు. ఆ మ్యాచ్లో భారత్ జట్టు గెలిచింది. కానీ.. నా మైండ్ మొత్తం రిటైర్మెంట్ ఆలోచనలతో నిండిపోయింది. కాబట్టి.. ఆ ఆఖరి 3-4 ఓవర్లలో కెప్టెన్గా ఎలా వ్యవహరించానో నాకు గుర్తులేదు’’ అని గంగూలీ వెల్లడించాడు.