హోమ్ క్వారంటైన్లో దాదా ...దాదా సోదరుడు స్నేహశీష్ గంగూలీకి కరోనా పాజిటివ్ ..
By: Sankar Thu, 16 July 2020 11:12 AM
కరోనా మహమ్మారి దెబ్బకు చిన్న పెద్ద , ధనిక బీద అనే తేడా లేకుండ అందరూ బలి అవుతున్నారు..ఇప్పటికే బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ ఫామిలీ తో పాటు చాల మంది ఈ కరోనా బారిన పడ్డారు ..అయితే అది ఇపుడు క్రికెట్ లోకి కూడా పాకింది ..టీమిండియా మాజీ కెప్టెన్ , ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఫ్యామిలిలో కరోనా పాజిటివ్ అని తేలింది ..
దీనితో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రస్తుతం హోం క్వారంటైన్లోకి వెళ్లారు. దాదా సోదరుడు, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(సీఏబీ) జాయింట్ సెక్రటరీ స్నేహాశీష్ గంగూలీకి కరోనా పాజిటివ్గా తేలింది. బెంగాల్ మాజీ ఫస్ట్ క్లాస్ ఆటగాడు స్నేహాశీష్ గంగూలీ చికిత్సం కోసం ప్రస్తుతం బెల్లె వి ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దాదా హోం క్వారంటైన్లోకి వెళ్లారు.
స్నేహాశీష్ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. ఈ రోజు అతడికి కరోనా పాజిటివ్గా తెలిసింది. ప్రస్తుతం అతడు బెల్లె వి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు’ అని సీఏబీ అధికారి ఒకరు తెలిపారు. ‘రిపోర్ట్స్ బుధవారం సాయంత్రం వచ్చాయి. హెల్త్ ప్రొటోకాల్స్ ప్రకారం సౌరవ్ కూడా కొద్ది రోజులు హోం క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది’ అని గంగూలీ సన్నిహితుడొకరు చెప్పారు.