చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా 150 మంది మహిళా కూలీలని స్వస్థాలలకు పంపిన సోనూసూద్
By: chandrasekar Sat, 30 May 2020 11:37 AM
ప్రత్యేకమైన బస్సుల
ద్వారా వలస కూలీలని వారి
స్వస్థాలలకు పంపించాడు నటుడు సోనూసూద్
లేటెస్ట్ గా చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా 150 మంది మహిళా కూలీలని వారి సొంత ఊర్లకి పంపారు. ఒడిశాలోని భువనేశ్వర్కి చెందిన మహిళా కూలీలు తమ ఉద్యోగాలకి రాజీనామా
చేసి ఇళ్ళకి వెళ్ళేందుకు రెడీ అయ్యారు.
కొచ్చి నుండి భువనేశ్వర్
వెళ్లేందుకు రవాణా వ్యవస్థ సరిగా లేని పరిస్థితులలో ప్రత్యేక చార్టర్డ్
ఫ్లైట్ ద్వారా వారందరిని స్వస్థలాలకి పంపారు సోనూసూద్.
కేఐటీఈఎక్స్
గార్మెంట్స్ లో పని చేసే 150 మందితో పాటు బవ
వుడ్ ఇండస్ట్రీకి చెందిన 9 మందిని కూడా
సేమ్ ఫ్లైట్లో పంపారు. మొదటి సారి మన దేశంలో వలస కార్మికులను ఫ్లైట్ ద్వారా
పంపిన ఘనత సోనూసూద్ గారికి దక్కింది.
Tags :
sonusood |
tamil |
laborers |