Advertisement

విమర్శలను పట్టించుకోను ..సోను సూద్

By: Sankar Wed, 24 June 2020 7:47 PM

విమర్శలను పట్టించుకోను ..సోను సూద్



లాక్‌డౌన్ కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వలస కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్. ఈ క్రమంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా.. సోనూపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విమర్శలపై తాజాగా సోనూ స్పందించాడు.

నా గురించి వచ్చిన ప్రశంసలను, ఆరోపణలను ఇప్పటివరకు పట్టించుకోలేదు. వలస కార్మికులకు సహాయం చేసే పనిలో నేను చాలా బిజీగా ఉన్నాను. అందువల్ల వాటి గురించి పట్టించుకునే తీరిక లేదు. అయినా, ఏదైనా మంచి పనిచేస్తే ఇలాంటి విమర్శలు తప్పవు. మంచి పనులు చేస్తున్నవారిని కొందరు కావాలనే వేలెత్తి చూపిస్తారు. వాటిని పట్టించుకోకుండా మనం చేయాలనుకున్న పని చేసుకుంటూ పోవాల`ని సోనూ సూద్ అన్నాడు.

కాగా లాక్ డౌన్ లో సోనూసూద్ ఎందరో వలస కార్మికులను తమ సొంత ప్రాంతాలకు తరలించారు ..చిన్న మెసేజ్ పెట్టిన కూడా స్పందించిన సోను , దేశంలో ఎక్కడికి నుంచి తనకు సమాచారము వచ్చిన స్పందించాడు ..బస్సుల్లో , విమానాలలో వాళ్ళని సొంత ప్రాంతాలకు తరలించడమే కాకుండా ముంబై లో ఉంటున్న అనేక మంది వలస కూలీలకు భోజన వసతి కల్పించాడు ..మరియు తన స్టార్ హోటల్ను కరోనా తో పోరాడుతున్న డాక్టర్లు , సిబ్బంది వాడుకోవచ్చు అని ఇచ్చేసాడు ..ఇలా నిర్విరామంగా సేవ చేసినప్పటికీ శివసేన వంటి పార్టీలు విమర్శించాయి ..

Tags :
|

Advertisement