Advertisement

  • మరోసారి తన గొప్పతనం చాటుకున్న సోనూసూద్ ..వలస కార్మికుల కుటుంబాలకు ఆర్ధిక సాయం ..

మరోసారి తన గొప్పతనం చాటుకున్న సోనూసూద్ ..వలస కార్మికుల కుటుంబాలకు ఆర్ధిక సాయం ..

By: Sankar Mon, 13 July 2020 2:30 PM

మరోసారి తన గొప్పతనం చాటుకున్న సోనూసూద్ ..వలస కార్మికుల కుటుంబాలకు ఆర్ధిక సాయం ..



కరోనా మహమ్మారి కారణంగా ఎవరికీ వారే ఇంట్లో ఉంటూ తమ యొక్క ఆరోగ్యాన్ని , తమ కుటుంబం యొక్క ఆరోగ్యానికి కాపాడుకుంటూ ఉన్నారు ..కానీ సోను సూద్ మాత్రం అలా కాదు ..లాక్ డౌన్ విధించగానే ఎటు పోవాలో తేలేక తినడానికి తిండి లేక అవస్థలు పడుతున్న వలస కార్మికులను ఆదుకున్నాడు ..దేశవ్యాప్తంగా అనేక మంది వలస కూలీలను తన సొంత ఖర్చులతో వారి సొంత ప్రాంతాలకు వెళ్ళడానికి బస్సులు అరెంజ్ చేసాడు ..కొంతమందిని చార్టెడ్ ఫ్లైట్ లలో కూడా పంపించాడు ..ఇలా దేశ వ్యాప్తంగా సోను సూద్ చేసిన సేవకు ప్రజలు అందరు ప్రశంసించారు ..కష్టకాలంలో ఇంటికే పరిమితం కాకుండా ప్రజల కష్ట సుఖాలను పట్టించుకున్న సోను సూద్ నిజమైన హీరో అని పొడిగారు ...

అయితే సోను సూద్ మరోసారి తనగొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభంతో తీవ్రంగా నష్టపోయిన వలస కార్మిక కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. మరణించిన లేదా గాయపడిన కార్మికుల కుటుంబాలకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాననీ వారికి మద్దతు ఇవ్వడం బాధ్యతగా భావిస్తునని సూద్ ఒక ప్రకటనలో తెలిపారు.దీనికి సంబంధించిన వివరాలను ఇప్పటికే సేకరించారు. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ సహా వివిధ రాష్ట్రాల అధికారులతో సంప్రదించి ప్రాణాలు కోల్పోయిన వలసదారుల సంబంధిత సమాచారం చిరునామాలు, బ్యాంక్ వివరాలను తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా అమలైన వివిధ దశల లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన కార్మికులు ఇంటి బాట పట్టారు. ఈ సందర్భంగా వివిధ ప్రమాదాల్లో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అలాంటి వలస కార్మికులకు కుటుంబాలకు అండగా నిలవనున్నారు. సుమారు 400 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని సోను సూద్ సోమవారం తాజాగా ప్రకటించారు.

Tags :
|

Advertisement