పంజాబ్ స్టేట్ ఐకాన్ గా భారత ఎన్నికల సంగంచే నియమితుడు అయిన సోనూసూద్
By: Sankar Tue, 17 Nov 2020 08:36 AM
ప్రముఖ నటుడు సోనుసూద్ను పంజాబ్ స్టేట్ ఐకాన్గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు ఈసీఐకి పంపిన ప్రతిపాదనను ఆమోదించింది.
పలు భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సోనుసూద్ది పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లా. కరోనా వైరస్ ప్రేరేపిత లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు వారి స్వస్థలాలకు చేరుకునేందుకు బస్సులను ఏర్పాటు చేశారు. పలు దేశాల్లో చిక్కుకుపోయిన వారిని స్వస్థలాలకు రప్పించేందుకు సైతం సొంత ఖర్చులతో విమానాలను సైతం ఏర్పాటు చేయించాడు. ఎక్కడ కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు.
పేద పిల్లలకు ఉచిత విద్య, స్కాలర్ షిప్లు.. వైద్య సదుపాయాలను కూడా అందిస్తున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది. సోనుసూద్ సేవలకి ఇటీవల ఐక్యరాజ్యసమితి (యుఎన్డీపీ) ఎస్డీజీ స్పెషల్ హ్యుమానిటేరియన్ యాక్షన్ అవార్డుతో సత్కరించింది.