Advertisement

  • ఆదివారం మధ్యాహ్నం గంగారామ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయబడ్డ సోనియా గాంధీ

ఆదివారం మధ్యాహ్నం గంగారామ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయబడ్డ సోనియా గాంధీ

By: chandrasekar Mon, 03 Aug 2020 10:04 AM

ఆదివారం మధ్యాహ్నం గంగారామ్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయబడ్డ సోనియా గాంధీ


పోయిన వారం ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ ఆదివారం డిశ్చార్జ్‌ అయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ‍స్పత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం డిశ్చార్జ్‌ అయ్యారు. రెగ్యూలర్ హెల్త్ చెకప్‌లో భాగంగానే సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరారని సీనియర్ డాక్టర్ తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం మధ్యాహ్నం ఆ‍స్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా వైద్య పరీక్షల నిమిత్తం జులై 30న ఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో చేరడం తెలిసిందే. 73 ఏళ్ల సీనియర్ నాయకురాలు రెగ్యూలర్ హెల్త్ చెకప్ కోసం గురువారం రాత్రి ఆస్పత్రిలో చేరారని హాస్పిటల్ చైర్ పర్సన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు సోనియాను డిశ్ఛార్జ్ చేసినట్లు వెల్లడించారు.

ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, వైద్య పరీక్షలు పూర్తి కావడంతో ఆస్పత్రి నుంచి ఆమెను డిశ్ఛార్జ్ చేశామన్నారు. కాగా, గురువారం నాడు దేశంలో కరోనా విపత్కర పరిస్థితులు, దాని ప్రభావంపై చర్చించేందుకు పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులతో గురువారం ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించారు.

ఆమె రెగ్యూలర్ హెల్త్ చెకప్ కోసం గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో కడుపు నొప్పి రావడంతో గంగారామ్ ఆసుపత్రిలోనే చేరి చికిత్స పొందారు. ఆ సమయంలో పార్టీ నేతలు సోనియా ఆరోగ్యం పట్ల ఆందోళనకు గురయ్యారు.

Tags :

Advertisement