Advertisement

  • కరోనా భయంతో సోఫాలో కూర్చున్న చోటనే మరణించిన కొడుకు , తెల్లవారగానే తల్లి కూడా మృతి

కరోనా భయంతో సోఫాలో కూర్చున్న చోటనే మరణించిన కొడుకు , తెల్లవారగానే తల్లి కూడా మృతి

By: Sankar Thu, 13 Aug 2020 8:51 PM

కరోనా భయంతో సోఫాలో కూర్చున్న చోటనే మరణించిన కొడుకు , తెల్లవారగానే తల్లి కూడా మృతి



కరోనా వ్యాధి కన్నా ఆ భయంతోనే ఎక్కువమంది చనిపోతారు ..తాజాగా అలంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలో నారాయణ్ ఖేడ్ జిల్లాలో జరిగింది ..కరోనా భయంతో సోఫాలో కూర్చున్న కొడుకు కుర్చునట్లే చనిపోగా , ఆ ఆవేదనను భరించలేక తెల్లారేసరికి తల్లి కూడా చనిపోయింది ..

కేవలం 12 గంటల వ్యవధిలో తల్లీ కొడుకులు చనిపోవడంతో ఆ ఉమ్మడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లోని కుటుంబ సభ్యుల్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ కాగా, ఇద్దరు వైరస్ సోకి చనిపోయారు. బుధవారం రాత్రి కుమారుడు (35), ఉదయానికి తల్లి (65) చనిపోవడం తీవ్ర సంచలనం రేపుతోంది.

బుధవారం రాత్రి కుమారుడు సోఫాలో కూర్చొని కుప్పకూలి చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ శవాన్ని సోఫాతో సహా బయట ఉంచేశారు. ఇలా రాత్రి నుంచి మధ్యాహ్నం వరకూ కుమారుడి మృత దేహం వానలోనే తడుస్తూ ఉండడం గమనార్హం. గురువారం ఉదయం అతని తల్లి కరోనా వల్ల చనిపోయింది.

దీంతో ఈ ఇద్దరి మృతదేహాలను శ్మశానానికి కూడా కుటుంబ సభ్యులు తీసుకెళ్లలేదు. మున్సిపల్ సిబ్బందే వీరిద్దరి మృతదేహాలను తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరోనా భయంతో కనీసం కుటుంబంలో ఒక్కరు కూడా అంత్యక్రియలకు వెళ్లలేదు.

Tags :
|
|
|
|
|
|

Advertisement