తల్లికి కర్మలు నిర్వహిస్తూ కొడుకు కూడా అక్కడిక్కడే మృతి
By: Sankar Sun, 26 July 2020 10:05 AM
తల్లికి పిండం పెడుతూ కుమారుడు కరోనాతో మృతి చెందాడు. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు గ్రామంలో శనివారం ఈ సంఘటన జరిగింది. ఎస్సై జానా సతీష్ తెలిపిన వివరాల ప్రకారం...గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాస్ తల్లి 11 రోజుల క్రితం మృతి చెందింది. శనివారం వారి బంధువులు, కుమారుడు తల్లికి పిండం కార్యక్రమం ఉంది.
అందులో భాగంగా పిండం పెడుతూనే శ్రీనివాస్ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెండాడు. వెంటనే బంధువులు వైద్యాధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహానికి కోవిడ్ టెస్ట్లు నిర్వహించగా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో గ్రామస్తులు ఎవ్వరూ మృతదేహాన్ని దహనం చేయడానికి వెళ్లలేదు. దీంతో కుటుంబ సభ్యులు నలుగురు గ్లౌజ్లు ధరించి మాస్కులు పెట్టుకుని అంత్యక్రియలు పూర్తిచేశారు. వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో కరోనా కేసులు తీవ్ర రూపం దాల్చాయి ..గడిచిన 24 గంటల్లో వెయ్యికి పైగా కరోనా పపాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..దీనితో అధికారులు అత్యవసరం అయితేనే తప్ప ప్రజలను బయటకు రావొద్దు అని సూచిస్తున్నారు