అద్భుతమైన కెప్టెన్ కింద ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారు; పియూష్ చావ్లా
By: chandrasekar Wed, 16 Sept 2020 3:39 PM
ఐపీఎల్ 2020
వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ పియూష్
చావ్లాను రూ.6.75
కోట్లకు కొనుగోలు చేసింది. 2012లో టీమిండియా తరపున చివరిసారిగా ఆడాడు. ఆ తరువాత
కేవలం దేశవాళి, ఐపీఎల్ టోర్నీలు మాత్రమే ఆడుతున్నాడు. తనను ధోని
సీఎస్కేలోకి తీసుకోవడం గురించి చావ్లా మాట్లాడుతూ ఎనిమిదేళ్ల తరువాత ధోనీ
కెప్టెన్సీలో క్రికెట్ ఆడటం సంతోషంగా ఉందన్నాడు. మొదట కోల్కతా జట్టులో ఆడిన
చావ్లాను చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో బలమైన స్పిన్ లైనప్ ఉన్నప్పటికీ ధోని
ఎంపిక చేసుకున్నాడు. ఇదే విషయమై చావ్లా
మీడియాతో మాట్లాడుతూ అద్భుతమైన కెప్టెన్ కింద ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారన్నాడు.
“ఒక కెప్టెన్ మిమ్మల్ని నమ్మితే, అంతకన్నా ఏం కావాలి. చాలా కాలం తరువాత ధోనితో కలిసి
ఆడటం సంతోషంగా ఉంది. అతడు బౌలర్లకు స్వేచ్ఛనిస్తాడు. మీకు ఎలా చేయాలనిపిస్తే అలా
చేయండని ప్రోత్సహిస్తాడు. బౌలర్కు సూచనలు
చేయాల్సి వచ్చినప్పుడల్లా వికెట్ల వెనుక నుంచి సలహా ఇస్తుంటాడు.” అని చావ్లా తెలిపాడు.
ఈ ఏడాది యూఏఈలో జరుగనున్న ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లో సీఎస్కే ముంబై ఇండియన్స్తో
తలపడనున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ మూడుసార్లు ఛాంపియన్స్గా
నిలువగా ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు
టైటిల్ గెలుచుకుంది.