Advertisement

  • పట్టపగలే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడి చేసిన భూకబ్జాదారులు

పట్టపగలే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడి చేసిన భూకబ్జాదారులు

By: Sankar Wed, 09 Sept 2020 4:28 PM

పట్టపగలే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడి చేసిన భూకబ్జాదారులు


భూకబ్జాదారులు రెచ్చిపోయారు. పట్టపగలు ఓ ఇంటిపై దాడికి దిగారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడికి దిగారు.అడ్డు వచ్చిన ఆమె తల్లిపై కూడా దాడి చేశారు.

నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల కేంద్రంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ హరిప్రసాద్ ప్రభుత్వ భూమిని స్కూల్ పిల్లల గ్రౌండ్ కోసం ఉపయోగించాలని అధికారుల్నికోరారు. 430 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని స్కూల్ పిల్లల గ్రౌండ్ కోసం ఉపయోగించాలన్నాడు.

అందుకోసం భూమి వివరాలు ఆర్టీఐ ద్వారా అధికారులకు అడగడంతో అతడిపై కక్ష్య కట్టిన కబ్జాదారులు దాడికి దిగారు. నీళ్ల బాటిల్ తెచ్చేందుకు బండిపై బయటకు వెళ్లిన హరిప్రసాద్‌ను ఇంటివరకు కొందరు బైకుపై ఫాలో అయ్యారు. అతడు ఇంటికి చేరుకోగానే.. ఇంటి గేటు బయటే ఆయనపై దాడికి దిగారు. అడ్డుకున్న తల్లిని కూడా తోసివేశారు. ఈ ఘటనలో హరిప్రసాద్ తల్లికి కూడా గాయాలయ్యాయి. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డ్ కావడంతో తొమ్మిది మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Advertisement