Advertisement

  • కోతులను బయటకు పంపించే క్రమంలో కరెంటు షాక్ కు గురియై సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ మృతి

కోతులను బయటకు పంపించే క్రమంలో కరెంటు షాక్ కు గురియై సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ మృతి

By: Sankar Thu, 31 Dec 2020 7:14 PM

కోతులను బయటకు పంపించే క్రమంలో కరెంటు షాక్ కు గురియై సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ మృతి


హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ కోతి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ ప్రాణాలు తీసింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లి జయనగర్‌లో నివాసం ఉంటున్న లోకేష్‌.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కరోనా లాక్‌డౌన్ అప్పటి నుంచి అతడు ఇంటి వద్ద నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు.

వర్క్ ఫ్రం హోమ్‌ చేస్తున్న లోకేష్‌.. మంగళవారం మధ్యాహ్నం రెండో ఫ్లోర్‌లో ఉన్న తన ఇంట్లోకి కోతులు రావడం గమనించాడు. కోతులు ఇంట్లోకి ప్రవేశించకుండా వాటిని బెదరగొట్టే ప్రయత్నం చేశాడు. ఇంట్లో ఉన్న ఇనుప రాడు తీసుకుని.. కోతులను అక్కడి నుంచి తరిమేయడం మొదలుపెట్టాడు.

ఈ క్రమంలోనే లోకేష్‌ చేతిలో ఉన్న ఇనుపరాడ్‌ ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లకు తగిలింది.. దీంతో.. ఒక్కసారి షాక్‌కు గురైన లోకేష్‌ కుప్పకూలిపోయాడు.. ఇది గమనించి కుటుంబ సభ్యులు వెంటనే లోకేష్‌ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే లోకేష్‌ ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు.. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Tags :
|

Advertisement