ఈజిప్టులో పాము మసాజ్...
By: chandrasekar Thu, 31 Dec 2020 6:08 PM
ఆఫ్రికన్ దేశమైన
ఈజిప్టులో పాములను ఉపయోగించి మసాజ్ చేయడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది.
టెన్షన్, స్ట్రెస్, ఒంటి
నొప్పులు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి శరీరాన్ని, మనస్సును
చైతన్యం నింపడానికి బాడీ మసాజ్ ఉపయోగపడుతుంది. థాయ్ మసాజ్, ఫుట్
మసాజ్, హాట్
స్టోన్ మసాజ్, ఫైర్ మసాజ్ వంటి అనేక మసాజ్ ల గురించి మనం విన్నా౦.
పాము మసాజ్ ఉపయోగించడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈజిప్టు రాజధాని కైరోలో
కొత్తగా తెరిచిన మసాజ్ పార్లర్ లో చాలా మందికి పాముతో మసాజ్ చేస్తున్నారు.
పాముల్ని శరీరం మీద, వీపు
భాగాలపై వ్యాపింపచేయడానికి 28 రకాల విషసర్పాలను ఉపయోగించి 30
నిమిషాల పాటు మసాజ్ చేయడం వల్ల కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గి, రక్త ప్రసరణ పెరిగి, పునరుజ్వస్థితికి
చేరుతాయని మసాజ్ యజమాని చెప్పారు. ముందుగా పామును చూసి భయపడిన కస్టమర్లు ఇప్పుడు
సుఖమైన మసాజ్ చేయించుకోవాలని తహతహలాడుతున్నారు. ఈ మసాజ్ సర్వీస్ ను ముందుగా
ఉచితంగా నే ఆఫర్ చేశారు. అయితే ఇప్పుడు చాలా మంది పాము మసాజ్ పై ఆసక్తి చూపగా
దాదాపు రూ.500 ఫీజు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పామును
ఉపయోగించే మసాజ్ దృశ్యాలు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.