సీనియర్ న్యాయవాది జడ్జి ఎదుటే పొగతాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్
By: chandrasekar Fri, 14 Aug 2020 11:43 AM
కోర్టు విచారణలు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వర్చువల్గా
జరుగుతుండడం తెలిసిన విషయమే. రాజస్థాన్ హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న
సమయంలో సీనియర్ న్యాయవాది పొగతాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆరుగురు బీఎస్పీ
ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తున్న పిటిషన్పై
వాదనలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వర్చువల్ విచారణ సమయంలో
జడ్జి ఎదుటే సీనియర్ న్యాయవాది రాజీవ్ థావన్ కెమరాకు పేపర్ అడ్డుగా పెట్టుకుని
పొగతాగుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వర్చువల్ విచారణలో
కాంగ్రెస్ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా పాల్గన్నారు. వర్చువల్ విచారణలో
న్యాయవాది పొగతాగుతుండటాన్ని న్యాయమూర్తి గమనించారా అని తెలియడం లేదు.
Tags :
judge |
viral |