Advertisement

  • సీనియర్ న్యాయవాది జడ్జి ఎదుటే పొగతాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

సీనియర్ న్యాయవాది జడ్జి ఎదుటే పొగతాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్

By: chandrasekar Fri, 14 Aug 2020 11:43 AM

సీనియర్ న్యాయవాది జడ్జి ఎదుటే పొగతాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్


కోర్టు విచారణలు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వర్చువల్‌గా జరుగుతుండడం తెలిసిన విషయమే. రాజస్థాన్ హైకోర్టులో ఓ కేసు విచారణ జరుగుతున్న సమయంలో సీనియర్ న్యాయవాది పొగతాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తున్న పిటిషన్‌పై వాదనలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వర్చువల్ విచారణ సమయంలో జడ్జి ఎదుటే సీనియర్ న్యాయవాది రాజీవ్ థావన్ కెమరాకు పేపర్ అడ్డుగా పెట్టుకుని పొగతాగుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

వర్చువల్ విచారణలో కాంగ్రెస్ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కూడా పాల్గన్నారు. వర్చువల్ విచారణలో న్యాయవాది పొగతాగుతుండటాన్ని న్యాయమూర్తి గమనించారా అని తెలియడం లేదు.

Tags :
|
|

Advertisement