మోడీపై పెట్టుకున్న ఒక్క ఆశ కూడా నెరవేరలేదని చెప్పుకొచ్చిన స్మిత..
By: chandrasekar Tue, 28 July 2020 1:28 PM
సింగర్ స్మిత ఎన్నికల్లో
మోడీకి అనుకూలంగా అడుగులేసింది. కానీ ఇప్పుడు మాత్రం మోడీ పాలనపై అసంతృప్తిగా
కనిపిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్మిత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఎక్కువ శాతం మంది తన కులం గురించి పదే పదే అడుగుతున్నారని నోరెత్తితే నీ కులం ఏంటి
అనే మాట తప్ప వేరొకటి రావడం లేదని అంటుంది స్మిత.
డిగ్రీకి వచ్చేప్పటి వరకు
తన కులం ఏంటో తనకు తెలియకుండానే పెరిగానని చెప్పింది ఈ సింగర్. తన కులంతో ఎలాంటి
అవసరం రాలేదని చెప్పుకొచ్చింది. కులం అంటే కూడా తనకు అర్థమయ్యేది కాదని చెప్పింది
ఈమె. రాజకీయాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి తనకు వచ్చేందుకు ఆసక్తి అయితే
లేదని చెప్పింది ఈమె. ఏదైనా పార్టీలో ప్రత్యక్షంగా చేరితే అయితే మన సొంత నిర్ణయాలను అమలు చేయలేమని
చెప్తుంది స్మిత. అందుకే ఎన్నికల సమయంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనిపిస్తే ఆ
పార్టీ వైపు ఉండాలనేదే తన అభిప్రాయంగా చెప్పింది ఈమె.
అంతకుమించి ప్రత్యక్ష
రాజకీయాల్లోకి వెళ్లి యాక్టివ్ పాలిటిక్స్ చేయాలనేది తనకు లేదంటూ స్మిత క్లారిటీ
ఇచ్చింది. ఇక మోడీ గురించి మాట్లాడుతూ ఆయన చేసే పనులు నచ్చట్లేదని చెప్పింది.
అప్పట్లో ఆయనకు అనుకూలంగా ఆల్బమ్ చేసిన ఈమె ఇప్పుడు మాత్రం చెప్పిన మాటలను..
ఇచ్చిన వాగ్ధానాలను పట్టించుకోవడం లేదని విమర్శిస్తుంది. మోడీపై పెట్టుకున్న ఒక్క
ఆశ కూడా నెరవేరలేదని చెప్పుకొచ్చింది ఈమె.