స్మార్ట్ ఈ–బైక్ " టీబైక్ ఒన్ ప్రో" ఆవిష్కరణ...
By: chandrasekar Tue, 08 Dec 2020 3:54 PM
ప్రతిష్టాత్మక క్రాస్
ఓవర్ స్మార్ట్ ఈ–బైక్ " టీబైక్ ఒన్ ప్రో" ను హైదరాబాద్ కేంద్రంగా
ఉన్న స్మార్ట్రాన్ ఇండియా ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అత్యధిక ఆర్ఓఐ , క్లౌడ్
కనెక్టడ్ ఆఫరింగ్తో ధృడమైన ఫీచర్లను అందించే రీతిలో తీర్చిదిద్దిన ఈ బైక్ను
ప్రత్యేకంగా భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న షేర్డ్/బీ2బీ
ఈ–బైక్ విభాగం కోసం తీర్చిదిద్దారు.
స్మార్ట్రాన్ ఇప్పుడు భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న14
నగరాలలో కస్టమైజ్డ్ స్మార్ట్ క్లౌడ్ కనెక్టడ్ ఈ–బైక్లను అందిస్తుంది.
ఇది లాజిస్టిక్స్, లీజర్
వ్యాపారాలు అయినటువంటి రిసార్ట్స్, రైడ్–షేర్, ఈ–కామర్స్, డెలివరీ ప్లాట్ఫామ్స్, ఈ–ఫార్మసీలు, ఈ–గ్రోసరీలకు
సేవలను అందించనుంది. ‘‘ఇంటిలిజెంట్ కనెక్టడ్ ఈ–బైక్, టీబైక్
ఒన్ ప్రో. ఇది వినూత్నమైనది, విప్లవాత్మక రీతిలో రైడర్లకు మెరుగైన ప్రయాణ
అనుభూతులను అందిస్తుంది.
భారతదేశంతో పాటు ప్రపంచం
కోసం భారతదేశంలో రూపకల్పన చేసి తీర్చిదిద్దడం పట్ల మేము గర్వంగా ఉన్నాము. ట్రాన్
ఎక్స్ ప్లాట్ఫామ్ శక్తితో మరిన్ని ఈవీ ఉత్పత్తులను విడుదల చేయడానికి మేము
సిద్ధంగా ఉన్నాము" స్మార్ట్రాన్ అని ఫౌండర్ అండ్ ఛైర్మన్ మహేష్
లింగారెడ్డి తెలిపారు.