టపాసులు కాల్చడంపై నిషేధం విధించిన ఆరు రాష్ట్రాలు...
By: chandrasekar Sat, 07 Nov 2020 6:28 PM
భారతీయులంతా దిపావళి పండగ
కోసం ముందుస్తుగా రెడీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనించి
కొన్ని రాష్ట్రాలు టపాసులు కాల్చడంపై బ్యాన్ విధించాయి. కరోనా పరిస్థితి వల్ల ఈ
నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నాయి. టపాసులు కాల్చడం వల్ల వచ్చే కాలుష్యం
కరోనావైరస్ సంక్రమణను మరింతగా పెంచే అవకాశం ఉంది.
నిషేధం విధించిన
రాష్ట్రాలు:
ఢిల్లీ: నవంబర్ 5న
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కీలక ప్రకటన చేశారు. కరోనా కారణంగా ఈ సారి
టపాసులు కాల్చడంపై నిషేధం విధించినట్టు
ఆయన తెలిపారు. పండగల కారణంగా కరోనావైరస్ సంక్రమణ ప్రమాదం మరింతగా పెరిగింది అని
అందుకే ప్రజలు ఈ సారి టపాసులు కాల్చడం మానేయాలి అని.. కాలుష్యం వల్ల మరింత ఇబ్బంది
కలిగే అవకాశం ఉంది అని ఆయన ప్రజలను కోరారు.
కర్ణాటక: నవంబర్ 6వ
తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి రాష్ట్రవ్యాప్తంగా టపాసులు కాల్చడంపై నిషేధం
విధిస్తున్నట్టు ప్రకటించారు. త్వరలో దీనిపై అధికారికంగా ఒక నిర్ణయం తీసుకుని
వివరాలు చెబుతాం అని తెలిపారు. కరోనావైరస్ వల్ల ఈ బ్యాన్ విధిస్తున్నట్టు
వివరించారు.
మహారాష్ట్ర: ఢిల్లీ
ప్రకటన తరువాత మరుసటి రోజు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తమ పౌరులను టపాసులు కాల్చడం
నుంచి దూరంగా ఉండమని అని కోరింది. అడిషనల్ మున్సిపల్ కమిషనర్ సురేష్ కాకాని ఈ
మేరకు ఒక ప్రకటన చేసి టపాసులు కాల్చేవారిపై చర్యలు తీసుకుంటాం అన్నారు.
ఒడిశా: నవంబర్ 3వ
తేదీన ఒడిశా ప్రభుత్వం టపాసులు అమ్మడం, కాల్చడం నిషేధిస్తున్నట్టు ఒక ఆర్డర్ జారీ చేసింది. ఈ
నిషేధం నవంబర్ 10 నుంచి 30 వరకు అమలులో ఉంటాయి.
పశ్చిమ బెంగాల్: నవంబర్ 5వ
తేదీన కాళీపూజ, దిపావళి, ఛాత్ పూజ సందర్భంగా టపాసులు కాల్చడంపై ఆ రాష్ట్ర
హైకోర్టు నిషేధం విధించింది. ఎలాంటి అమ్మకాలు చేయకూడదు అని స్పష్టం చేసింది.
రాజస్థాన్: రాజస్థాన్
ముఖ్యమంత్రి అశోఖ గెహ్లాట్ అందరి కన్నా ముందు టపాసులు కాల్చడంపై నిషేధం విధించారు.
దీనిపై ఒక ట్వీట్ చేసి ప్రజలకు సమాచారం అందించారు. ప్రజల ఆరోగ్యం కాపాడటానికి ఈ
నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.