ముంబైలోని ధారావిలో సిస్టర్ రేడియో...
By: chandrasekar Wed, 09 Dec 2020 7:49 PM
ఆసియాలోనే ముంబైలోని
ధారావి అతిపెద్ద మురికివాడ. అక్కడ
నిగూఢంగా ఉన్న కళలను, కళాకారులను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు బెంగాల్కు
చెందిన అక్వీ థామి. ఇంటికే పరిమితమైన స్త్రీలలోని రచయితల్ని వెలికితీసే ప్రయత్నంలో
భాగంగా 100 పుస్తకాలతో
ఓ సంచార గ్రంథాలయాన్ని ప్రారంభించారు.
‘సిస్టర్ లైబ్రరీ’ పేరుతో గృహిణుల రచనలకు ప్రత్యేక
స్థానం కల్పించారు. ఇప్పటికే,
15 లైబ్రరీలను తెరిచారు. విరాళాలే దీనికి ఆధారం. ఈ
ప్రయత్నంలో ఎంతోమంది స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా
కూడా విరాళాలు సేకరించారు.
సిస్టర్ లైబ్రరీ విజయం
ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు సిస్టర్ రేడియోనూ ప్రారంభిస్తున్నారు అక్వీ థామి. మన
సంస్కృతి, చరిత్ర, ఆధిపత్యం
ఇలా అన్నిటిపైనా మహిళల గొంతు వినిపిస్తామంటున్నారు. యూట్యూబ్ చానల్ను కూడా
ప్రారంభించబోతున్నారు.