తమ తండ్రి కలను సిరాజ్ నిజం చేసాడు ...సిరాజ్ సోదరుడు భావోద్వేగం
By: Sankar Sun, 27 Dec 2020 11:14 AM
మెల్బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో షమీ స్థానాల్లో హైదరాబాదీ పేస్ బౌలర్ సిరాజ్ జట్టులో స్థానం సాధించిన విషయం తెలిసిందే...ఆడుతుంది తొలి టెస్ట్ అయినా కూడా అద్భుతంగా బౌలింగ్ చేసిన సిరాజ్ రెండు కీలక వికెట్లు తీయడమే కాకుండా ఫీల్డింగ్ లో రెండు క్యాచ్ లు పట్టాడు దీనితో సిరాజ్ ప్రదర్శన మీద పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు...
ఇక సిరాజ్ టెస్టు ఎంట్రీ సందర్భంగా అతని సోదరుడు మహ్మద్ ఇస్మాయిల్ ఆనందం వ్యక్తం చేశాడు. తమ తండ్రి కలను సిరాజ్ నిజం చేశాడని అన్నాడు. తమకెంతో గర్వంగా ఉందని మీడియా పేర్కొన్నాడు. తన తమ్ముడి ఆటకోసం ఉదయం నాలుగు గంటలకే టీవీ ఆన్ చేశామని ఇస్మాయిల్ చెప్పుకొచ్చారు.
కాగా, మహ్మద్ సిరాజ్ తండ్రి ఊపితిత్తుల వ్యాధితో బాధపడుతూ గత నవంబర్లో హైదాబాద్లో మృతి చెందారు. అయితే, ఆస్ట్రేలియా టూర్లో ఉన్న సిరాజ్ కరోనా నిబంధనల మేరకు తండ్రి అంత్యక్రియలకు స్వదేశానికి రాలేకపోయాడు. అతను భారత్ వచ్చేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చినప్పటికీ.. జట్టు ప్రయోజనాల దృష్ట్యా సిరాజ్ అక్కడే ఉండిపోయాడు. అతని నిర్ణయం పట్ల చాలా మంది క్రీడా ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపించారు..