Advertisement

  • సింగర్ సునీత వీరాభిమానిని మోసం చేసి ఏకంగా కోటి 70 లక్షల రూపాయలు కాజేశాడు

సింగర్ సునీత వీరాభిమానిని మోసం చేసి ఏకంగా కోటి 70 లక్షల రూపాయలు కాజేశాడు

By: chandrasekar Wed, 12 Aug 2020 7:32 PM

సింగర్ సునీత వీరాభిమానిని మోసం చేసి ఏకంగా కోటి 70 లక్షల రూపాయలు కాజేశాడు


సింగర్ సునీత వీరాభిమానిని మోసం చేసిని ఒక వ్యక్తి ఏకంగా కోటి 70 లక్షల రూపాయలు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింగర్ సునీత పేరు చెప్పుకుని భారీ మోసానికి పాల్పడ్డాడు ఓ మాయగాడు. ఆమె వీరాభిమాని నుంచి ఏకంగా కోటి 70 లక్షల రూపాయలు కాజేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ సింగర్ సునీతకు వీరాభిమాని దీన్ని ఆసరాగా చేసుకున్న చైతన్య అనే వ్యక్తి సునీత్ వాట్సాప్ ఫోన్ నంబర్ ఇచ్చాడు.

ఈ విధంగా ఆమెను నమ్మించి మోసం చేసాడు. ఆ తరువాత ఆమె నుంచి కేరళలోని ఆనంద చేర్లాయం ట్రస్ట్‌లో రూ. 50 వేల సభ్యత్వం తీసుకోవాలని సూచించాడు. ఆ తరువాత ఏవో కట్టు కథలు చెప్పి ఆమె నుంచి పలు విడతలుగా కోటి 70 లక్షలు కాజేశాడు. డబ్బులు పోగొట్టుకున్న తరువాత నిందితుడిపై అనుమానం వచ్చిన బాధితురాలు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బాగోతం బయటపడింది.

మరోవైపు చైతన్య అనే వ్యక్తి తన పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి రావడంతో ఈ అంశంపై సింగర్ సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైతన్య ఎవరో తనకు తెలియదని అతని మాయలో ఎవరూ పడొద్దని సూచించారు. చాలామంది అభిమానుల అవకాశాన్ని సొమ్ము చేసుకోవడంలో చాకిచక్యంగా వ్యవహరించి డబ్బులు దోచేస్తున్నారు. ఇటువంటి వ్యక్తుల విషయంలో ప్రజలందరూ తగు జాగ్రత్త వహించవలసిందిగా పోలీసులు కోరుచున్నారు.

Tags :

Advertisement