Advertisement

  • సింగరేణిలో లాక్ డౌన్ పెట్టాలని కార్మికుల డిమాండ్ ..

సింగరేణిలో లాక్ డౌన్ పెట్టాలని కార్మికుల డిమాండ్ ..

By: Sankar Mon, 27 July 2020 5:57 PM

సింగరేణిలో లాక్ డౌన్ పెట్టాలని కార్మికుల డిమాండ్ ..



తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఇప్పుడు కరోనా కేసులు గ్రామాలు, పట్టణాలుకు సైతం వ్యాపించాయి. ప్రతీ చోట ప్రతీ ప్రాంతంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల్లో కరోనా కలకలం రేపుతోంది.

బొగ్గు గనుల్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా కొవిడ్-19 బారిన పడి.. ఓ కార్మికుడు కూడా మృతి చెందడం వల్ల సింగరేణి కార్మికులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే లాక్డౌన్ ప్రకటించి తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. లేకుంటే తామే స్వయంగా విధులు బహిష్కరిస్తామని సింగరేణి కార్మికులు అంటున్నారు.

పెద్దపెల్లి జిల్లా రామగుండం అర్జీ-1 ఏరియాలోని 11ఏ బొగ్గుగనిలో ఉదయం షిఫ్ట్లో కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించారు. అనంతరం గనిపై నిరసన చేపట్టారు. కరోనా లక్షణాలతో పలువురు కార్మికులు మృతి చెందారని, పలువురు వైరస్ లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. వెంటనే లాక్డౌన్ ప్రకటించాలని కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై సింగరేణి యాజమాన్యం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ఇంటికి వెళ్ళిపోయారు.

గనుల్లో పనిచేసే కార్మికుల్లో ఎవరికి కరోనా ఉందోనన్న ఆందోళన వారి కుటుంబాల్లో సైతం నెలకొంది. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం కార్మికుల భద్రత గురించి ఆలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి ఇళ్లలోనే ఉంటామని కార్మికులు తెలిపారు

Tags :
|
|

Advertisement