ప్రేమ, పెళ్లి పేరుతో మోసపోయిన యువతి న్యాయం చేయాలని కోరుతూ మౌనపోరాటం
By: chandrasekar Sat, 15 Aug 2020 4:56 PM
ఓ కానిస్టేబుల్ ప్రేమ
పేరుతో ఓ యువతి వెంటపడి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసాడు. ఆ మోసాన్ని బాధితురాలు తట్టుకోలేక ఆవేశంలో
పురుగుల మందు తాగింది. ఆస్పత్రి నుంచి
కోలుకుని డిశ్చార్జ్ కాగానే ప్రియుడికి షాక్ ఇచ్చింది.
తనకు న్యాయం చేయాలని
కోరుతూ యువతి మౌనపోరాటానికి దిగింది. ఈ ఘటన గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం
ఉప్పలపాడు శివారు చల్లాపల్లి తండాలో జరిగింది.
చల్లాపల్లి తండాకు చెందిన
యువతి అదే తండాకు చెందిన శివానాయక్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శివానాయక్
విజయవాడలో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. రెండేళ్లు ఇద్దరు
చెట్టాపట్టాలేసుకుని తిరిగారు ప్రేమ వ్యవహారం బాగానే సాగింది. కానీ రెండేళ్లు
ప్రేమ నడిపి చివరకు పెళ్లి చేసుకోవడానికి అతడు ఒప్పుకోలేదు.
యువతి రెండు రోజుల క్రితం
మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే కుటుంబ సభ్యులు
ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె కోలుకున్న వెంటనే తనకు న్యాయం చేయాలని డిమాండ్
చేస్తూ కానిస్టేబుల్ ఇంటి ముందు ధర్నాకు దిగింది.