పాక్లో సిక్కు బాలికలను అపహరించి బలవంత మతమార్పిడి...శిరోమణి అకాలీదళ్ నిరసన
By: chandrasekar Wed, 23 Sept 2020 4:08 PM
శిరోమణి అకాలీదళ్ కు
చెందిన మహిళా కార్యకర్తలు పాకిస్థాన్లో సిక్కులపై జరుగుతున్న దురాగతాలకు
వ్యతిరేకంగా ఢిల్లీలో మంగళవారం నిరసన తెలియచేసారు.
సాయంత్రం వేళ
కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ
దేశంలో సిక్కు బాలికలను అపహరించి బలవంత మతమార్పిడులకు పాల్పడుతున్నాని మహిళలు
ఆరోపించారు.
పాకిస్థాన్లో అపహరించిన
సిక్కు బాలికలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై
స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags :
abducted |
pakistan |