Advertisement

  • తమిళనాడులో గణనీయంగా నమోదవుతున్న కరోనా కేసులు

తమిళనాడులో గణనీయంగా నమోదవుతున్న కరోనా కేసులు

By: chandrasekar Tue, 25 Aug 2020 09:10 AM

తమిళనాడులో గణనీయంగా నమోదవుతున్న కరోనా కేసులు


తమిళనాడులో గణనీయంగా కరోనా కేసులు నమోదవుత్తున్నాయి. కరోనా ఉదృతి తమిళనాడు లో మరి తీవ్రం గా వుంది. ఇంతకు మునుపు చేన్నైలో మాత్రమే అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యేవి. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఇంకా కొనసాగుతున్నది. గత నెల రోజులుగా ఆ రాష్ట్రంలో ప్రతిరోజు ఐదు వేలకు తగ్గకుండా కరోనా కేసులు, సుమారు వంద వరకు మరణాల సంఖ్య నమోదవుతున్నాయి.

ఇక్కడ టెస్టుల సంఖ్య కూడా అధికంగానే చేస్తున్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,967 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 97 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,85,352కు మరణాల సంఖ్య 6,614కు చేరిందని తెలిపారు. కాగా, ఇప్పటి వరకు 3,25,456 మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 53,282 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. ప్రజలు మాస్కులు పెట్టుకొని సామాజిక దూరాన్ని పాటించడం వల్ల కొంతవరకైనా కరోనా ని అరికట్టవచ్చని అధికారులు తెలుపుతున్నారు.

Tags :
|

Advertisement