సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తుదిశ్వాస విడిచారు
By: chandrasekar Thu, 06 Aug 2020 10:06 AM
సిద్దిపేట జిల్లా దుబ్బాక
ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా తీవ్ర
అనారోగ్యంతో బాధపడుతన్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ
బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు.
రామలింగారెడ్డి దుబ్బాక
నియోజకవర్గం నాలుగు సార్లు శాసనసభ్యుడిగా గెలుస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్కు
అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. ఆయన మృతిపట్ల టీఆర్ఎస్ నేతలు దిగ్భాంత్రి
వ్యక్తం చేశారు.
రామలింగారెడ్డి స్వస్థలం
దుబ్బాక మండలం చిట్టాపూర్. ఆయన భార్య సుజాత, కుమారుడు
సతీష్ రెడ్డి, కుమార్తె
ఉదయశ్రీ ఉన్నారు. 2004 లో
మొదటి సరిగా దుబ్బాక నుంచి ఎమ్యెల్యేగా గెలుపొందారు. 2008 ఉప ఎన్నికల్లో మరోసారి విజయం సాధించారు.
2009లో
ఓటమి అనంతరం 2014, .2019
ఎన్నికల్లో గెలిచారు. అంతకు ముందు రామ లింగారెడ్డి వివిధ వార్త పత్రికలో ఉమ్మడి
మెదక్ జిల్లా, జహీరాబాద్, దుబ్బాక, సిద్దిపేట, సంగారెడ్డి ప్రాంతాల్లో పని చేశారు. జర్నలిస్ట్
నాయకుడిగా రాష్ట్రంలో పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. నక్సలైట్ ఉద్యమంలోనూ పాల్గొని
కొన్ని రోజుల పాటు పోలీసుల నిర్బంధాన్ని కూడా
ఎదుర్కొన్నారు.