ఫ్లిప్కార్ట్, పతంజలి సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ
By: chandrasekar Wed, 14 Oct 2020 4:24 PM
న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్, పతంజలి
సంస్థలకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) షోకాజ్ నోటీసులు జారీ
చేసింది.
సంస్థల మూసివేత కోసం
షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ)కు
తెలియజేసింది.
సీపీసీబీలో నమోదు కాలేదని, ప్లాస్టిక్
వ్యర్థాల నిర్వహణ (సవరణ) నిబంధనలు 2018ను పాటించడం లేదని పేర్కొన్నది.
ఈ విషయంలో తాము సమాచారం
ఇచ్చినా తగు విధంగా స్పందించడం లేదని ఎన్జీటీకి సమర్పించిన నివేదికలో సీపీసీబీ
వెల్లడించింది.
ఈ క్రమంలోనే పర్యావరణ
రక్షణ చట్టం 1986లోని సెక్షన్ 5 కింద ఈ నెల 8న షోకాజ్ నోటీసులు జారీ చేశామ౦ది.
Tags :
flipkart |