Advertisement

  • ఫ్లిప్‌కార్ట్‌, పతంజలి సంస్థలకు షోకాజ్‌ నోటీసులు జారీ

ఫ్లిప్‌కార్ట్‌, పతంజలి సంస్థలకు షోకాజ్‌ నోటీసులు జారీ

By: chandrasekar Wed, 14 Oct 2020 4:24 PM

ఫ్లిప్‌కార్ట్‌, పతంజలి సంస్థలకు షోకాజ్‌ నోటీసులు జారీ


న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్‌, పతంజలి సంస్థలకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (సీపీసీబీ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

సంస్థల మూసివేత కోసం షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)కు తెలియజేసింది.

సీపీసీబీలో నమోదు కాలేదని, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ (సవరణ) నిబంధనలు 2018ను పాటించడం లేదని పేర్కొన్నది.

ఈ విషయంలో తాము సమాచారం ఇచ్చినా తగు విధంగా స్పందించడం లేదని ఎన్‌జీటీకి సమర్పించిన నివేదికలో సీపీసీబీ వెల్లడించింది.

ఈ క్రమంలోనే పర్యావరణ రక్షణ చట్టం 1986లోని సెక్షన్‌ 5 కింద ఈ నెల 8న షోకాజ్‌ నోటీసులు జారీ చేశామ౦ది.

Tags :

Advertisement