Advertisement

  • రెండేళ్లకు ఎంసీఏ కోర్సు కాల పరిమితిని కుది౦పు...

రెండేళ్లకు ఎంసీఏ కోర్సు కాల పరిమితిని కుది౦పు...

By: chandrasekar Tue, 22 Dec 2020 2:17 PM

రెండేళ్లకు ఎంసీఏ కోర్సు కాల పరిమితిని కుది౦పు...


రెండేళ్లకు ఎంసీఏ కోర్సు కాల పరిమితిని కుదిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.

అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తాజాగా ఈ కోర్సును రెండేళ్లకు కుదిస్తూ మార్గదర్శకాలిచ్చింది.

గతంలో ఈ కోర్సు కాల పరిమితి మూడేళ్లుగా ఉండేది.

ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ‘ప్రీరిక్విజైట్‌’ కోర్సును రూపొందించుకోవాలని ఆయా యూనివర్సిటీల వీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

దీనిలో చేరేందుకు మేథమెటిక్స్‌ సబ్జెక్టుతో బీఎస్సీ, బీఏ, బీకాం పూర్తిచేసిన అభ్యర్థులు వర్సిటీలు రూపొందించిన ‘ప్రీరిక్విజైట్‌’ కోర్సు పాసవ్వాలి.

Tags :
|

Advertisement