అమెరికాలో దుండగుల కాల్పులు ..ఒకరు మృతి పదకొండు మందికి తీవ్ర గాయాలు
By: Sankar Sun, 21 June 2020 9:24 PM
అమెరికా లో వరుస బాధాకర సంఘటనలు జరుగుతున్నాయి మొన్నటిదాకా కరోనా కారణంగా అమెరికా అతలాకుతలం అయింది .ప్రపంచం మొత్తం లోనే అత్యధిక కేసులు అమెరికాలో నమోదు అయ్యాయి ..ఆ తర్వాత నల్ల జాతీయుడు హత్యా ఉందంతంతో , నిరసనలతో అట్టుడికిపోయింది ..ప్రపంచం మొత్తం ఆ నిరసనలకు మద్దతుగా నిలిచింది ..హత్య చేసిన పోలీస్ ఆఫీసర్ ను అరెస్ట్ చేసేదాకా ఆ నిరసనలు ఆగలేదు ..అంతలోనే తాజాగా అమెరికా లో మరొక విషాదకర సంఘటన జరిగింది ..
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించింది. మిన్నెయాపోలిస్ నగరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థానికులపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 11 మంది గాయపడ్డారు. అర్ధరాత్రి 12.30 గంటలకు దుండగుడు విచక్షణారహితంగా విరుచుకుపడ్డాడని స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటన ఓ వ్యక్తి ఫేస్ బుక్ లైవ్ అధారంగా వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు స్థానికులెవరూ బయటకు రావద్దని సూచించారు.