Advertisement

  • అమెరికాలో దుండగుల కాల్పులు ..ఒకరు మృతి పదకొండు మందికి తీవ్ర గాయాలు

అమెరికాలో దుండగుల కాల్పులు ..ఒకరు మృతి పదకొండు మందికి తీవ్ర గాయాలు

By: Sankar Sun, 21 June 2020 9:24 PM

అమెరికాలో దుండగుల కాల్పులు ..ఒకరు మృతి పదకొండు మందికి తీవ్ర గాయాలు

అమెరికా లో వరుస బాధాకర సంఘటనలు జరుగుతున్నాయి మొన్నటిదాకా కరోనా కారణంగా అమెరికా అతలాకుతలం అయింది .ప్రపంచం మొత్తం లోనే అత్యధిక కేసులు అమెరికాలో నమోదు అయ్యాయి ..ఆ తర్వాత నల్ల జాతీయుడు హత్యా ఉందంతంతో , నిరసనలతో అట్టుడికిపోయింది ..ప్రపంచం మొత్తం ఆ నిరసనలకు మద్దతుగా నిలిచింది ..హత్య చేసిన పోలీస్ ఆఫీసర్ ను అరెస్ట్ చేసేదాకా ఆ నిరసనలు ఆగలేదు ..అంతలోనే తాజాగా అమెరికా లో మరొక విషాదకర సంఘటన జరిగింది ..

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించింది. మిన్నెయాపోలిస్‌ నగరంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి స్థానికులపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 11 మంది గాయపడ్డారు. అర్ధరాత్రి 12.30 గంటలకు దుండగుడు విచక్షణారహితంగా విరుచుకుపడ్డాడని స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. ఈ ఘటన ఓ వ్యక్తి ఫేస్ బుక్ లైవ్ అధారంగా వెలుగులోకి వచ్చింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు స్థానికులెవరూ బయటకు రావద్దని సూచించారు.

Tags :

Advertisement