Advertisement

  • షాకింగ్ న్యూస్: ఏలూరులో ఉన్నట్టుండి 23 మంది పిల్లలు సొమ్మసిల్లి పడ్డారు...తల్లిదండ్రుల ఆందోళన...

షాకింగ్ న్యూస్: ఏలూరులో ఉన్నట్టుండి 23 మంది పిల్లలు సొమ్మసిల్లి పడ్డారు...తల్లిదండ్రుల ఆందోళన...

By: chandrasekar Sat, 05 Dec 2020 10:46 PM

షాకింగ్ న్యూస్: ఏలూరులో ఉన్నట్టుండి 23 మంది పిల్లలు సొమ్మసిల్లి పడ్డారు...తల్లిదండ్రుల ఆందోళన...


పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఉన్నట్టుండి చిన్నారులు సొమ్మసిల్లి పడుతున్నారు. ఏం జరుగుతుందో తెలియక చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు.

జ్వాలా పహా రేశ్ర స్వామి ఆలయప్రాంతంలో పిల్లల్లో మూర్ఛ లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది.

వరసగా చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. పిల్లలను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. మూర్చ కేసులపై మంత్రి ఆళ్లనాని స్పందించారు.

ప్రత్యేక వైద్య బృందాలతో ఇంటింటి సర్వే చేయాలని మంత్రి ఆదేశించారు. ఆసుపత్రిలో చిన్నారులను ఆళ్ల నాని పరామర్శించారు. చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరినట్టుగా ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికి 23 మంది చిన్నారులు ఆసుపత్రిలో చేరారని, మూర్ఛకు కారణాలను వైద్యుల ద్వారా తెలుసుకుంటున్నామని ఆళ్లనాని చెప్పారు.

Tags :

Advertisement