Advertisement

  • హేమంత్ పరువు హత్య కేసు ..బయటకు వస్తున్న సంచలన విషయాలు

హేమంత్ పరువు హత్య కేసు ..బయటకు వస్తున్న సంచలన విషయాలు

By: Sankar Mon, 28 Sept 2020 11:47 AM

హేమంత్ పరువు హత్య కేసు ..బయటకు వస్తున్న సంచలన విషయాలు


హైదరాబాద్ లో ఇటీవల జరిగిన పరువు హత్యలో సంచలనం విషయాలు బయటకు వస్తాయి..హేమంత్ , అవంతిక పెళ్లి చేసుకోకముందు ఈ ఇద్దరి కుటుంబాలు చాల సన్నిహితంగా ఉండేవి అని తెలిసింది..హేమంత్, అవంతి తల్లులు ఇద్దరూ స్నేహితురాళ్లేనని పోలీసులు తేల్చారు. వారిద్దరి పరిచయం కారణంగానే హేమంత్, అవంతి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత వారిద్దరూ కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలు కాదనండంతో పెళ్లి చేసుకున్నారు.

అవంతి తల్లి అర్చన,హేమంత్ తల్లి రాణి చాలా కాలంగా సన్నిహితంగా ఉండేవారు. ఎవరి ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా వచ్చి వెళ్తూ ఉండేవారు.ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. హేమంత్ కూడా అవంతికి పరిచయం కావడంతో వీరి మధ్య ప్రేమకు దారి తీసింది. అయితే చాలా ఏళ్ల తర్వాత వీరి వ్యవహారం బయటకు రావడంతో అవంతి కుటుంబం ఒప్పుకోలేదు.

అయితే అప్పటి నుంచి రెండు కుటుంబాల మధ్య స్నేహం చెడిపోయింది. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవడంతోనే అవంతి కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక హేమంత్ ను చంపేశారని పోలీసులు వెల్లడించారు. ఇటీవల అవంతి కూడా తన తల్లి తనకు బెదిరింపులకు పాల్పడిందని తెలిపింది. హేమంత్‌ను పెళ్లి చేసుకుంటే విషం పెట్టి చంపేస్తానని బెదిరించిందని పేర్కొంది. మొత్తం మీద ఇరు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉన్నా పిల్లల సంతోషం కోసం అవంతి కుటుంబం ఆలోచించలేదు. పగ ప్రతీకారం, పరువు అంటూనే హేమంత్‌ను దారుణంగా హతమార్చింది.

Tags :
|

Advertisement