Advertisement

  • రామ్ గోపాల్ వర్మకు షాక్..మర్డర్ మూవీ నిర్మాతలకు నోటీసులు పంపిన కోర్టు

రామ్ గోపాల్ వర్మకు షాక్..మర్డర్ మూవీ నిర్మాతలకు నోటీసులు పంపిన కోర్టు

By: chandrasekar Fri, 07 Aug 2020 11:39 AM

రామ్ గోపాల్ వర్మకు షాక్..మర్డర్ మూవీ నిర్మాతలకు నోటీసులు పంపిన కోర్టు


కరోనా వైరస్‌ లాక్‌డౌన్ సమయంలో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్, థ్రిల్లర్ అంటూ సినిమాలు తీసిన ఈయన లేటెస్ట్‌గా తెరకెక్కిస్తోన్న మరో చిత్రం 'మర్డర్‌'. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటన ఆధారంగా ఆర్జీవీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకోవడం. అది సహించలేని అమ్మాయి తండ్రి అబ్బాయిని హత్య చేయించడం తర్వాత అమ్మాయి తండ్రి తీవ్రంగా మనోవేదన పడటం అనే సన్నివేశాలను ఈ ట్రైలర్‌లో చూపించి సంచలనం రేపాడు రామ్‌గోపాల్ వర్మ. ఈ సినిమా విషయమై ఇప్పటికే అమృత సినిమా విడుద‌లను ఆపేయాల‌ని, చిత్ర ప్రచారాన్ని వెంట‌నే ఆపమ‌ని కోరుతూ అమృత‌ నల్గొండ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కోర్టు మర్డర్ మూవీ నిర్మాతలకు నోటీసులు పంపింది. హత్యకేసు విచారణ దశలో ఉన్న ఈ దశలో కల్పిత కథతో ఉన్న సినిమా విడుదలైతే అది సాక్షులపై వ్యతిరేక ప్రభావం పడే ఛాన్స్ ఉందని తమ పిటిషన్‌లో అమృత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా విడుదలను ఆపడానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోర్డును కోరారు.

ఈ సినిమా విషయమై విచారణ చేపట్టిన నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్డు దర్శక, నిర్మాతలకు కౌంటర్ దాఖలు చేసేందకు ఈ నెల 11 వరకు సమయం కేటాయించింది. ఇక ‘మర్డర్’ సినిమా విషయంలో వర్మ ఈ సినిమాను నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించినట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.

Tags :
|
|

Advertisement